BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:29 PM
9 వీక్షణలు

మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ

మధిర టౌన్, ఆగస్టు 30: మానవ సేవే భగవంతుని సేవ అనే భావనతో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లంకా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్లు పంపిణీ చేశారు.

మధిర పట్టణంలోని అజాద్ రోడ్డులో లంకా కొండయ్య నివాసం వద్ద ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ ఉచిత పాతబట్టల కేంద్రం, హెల్పింగ్ హోమ్ ద్వారా వివిధ దాతలు అందించిన వస్త్రాలు, గృహ సామగ్రిని సంచార జాతులకు చెందిన పేద కుటుంబాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సీపీఎం నాయకులు శీలం నర్సింహారావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శీలం నర్సింహారావు తన ఇంట్లోని అదనపు దుస్తులను కూడా వితరణ చేశారు.

ఈ సేవా కార్యక్రమానికి మడుపల్లి చెందిన సాగి వెంకట్రావమ్మ, మధిర సీపీఎం మహిళా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, మధిర నివాసి చావా నర్సింహారావు, అజాద్ రోడ్డుకు చెందిన మన్నే ప్రభాత్ పార్వతి దంపతులతో పాటు పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దుస్తులు, సామాన్లు అందించారు.

దాతలు అందించిన వస్తువులను లంకా సేవా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా శీలం నర్సింహారావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.