బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి
తెలంగాణ
/
ఖమ్మం
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం:
మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన నాగరాజు, గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ ఎర్రుపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వీరిపై బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో నాగరాజు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టారు.