మోదీ పర్యటన ప్రభావం.. భారతీయులకు ఉజ్బెకిస్థాన్లో 30 రోజులు వీసా రహిత ప్రవేశం
అంతర్జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా భారతీయులకు ఆ దేశం శుభవార్త అందించింది. భారత పౌరులు 30 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండానే ఉజ్బెకిస్థాన్లో ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు.
భారత్–ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి.