పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్గా వై. మధుసూదన్ నాయుడు
పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్గా వై. మధుసూదన్ నాయుడు
నూతన ఇన్చార్జ్కు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా | పుంగనూరు | Ntoday News
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్చార్జ్గా నియమితులైన వై. మధుసూదన్ నాయుడును పుంగనూరు పట్టణ టీడీపీ నాయకులు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు నూతన ఇన్చార్జ్కు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని పట్టణ టీడీపీ నాయకులు, న్యాయవాదులు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన వై. మధుసూదన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, పుంగనూరులో టీడీపీకి మరింత బలమైన పునాది ఏర్పడేలా సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పాల్గొని నూతన ఇన్చార్జ్కు అభినందనలు తెలిపారు.