గోశాల అభివృద్ధికి చేయూత....
గోశాల అభివృద్ధికి చేయూత.. రూ.50 వేల విరాళం అందించిన శ్రీరామ జగదీష్ రాయల్ దంపతులు...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
బోయకొండ గంగమ్మ గోశాలకు రూ.50 వేల విరాళం
బోయకొండ గంగమ్మ సేవలో ఎన్నారై దంపతులు.. గోశాలకు రూ.50 వేల సాయం
ఆంధ్ర రాష్ట్రము, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ని ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు మలేషియా ఏపీ ఎన్నార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోఆర్డినేటర్ చౌడేపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీరామ జగదీష్ రాయల్, హిమబిందు దంపతులు రూ 50,000 లు విరాళాన్ని ఆలయ కార్యనిర్వహక అధికారి ఉప కమిషనర్ ఏకాంబరం కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.