BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 31 August 2026, 08:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు....

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:46 AM
17 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు.. ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్

గంజాయి కేసులో నిందితుడు స్టేషన్ నుంచి పరారైన ఘటనలో రిమాండ్ రిపోర్ట్ మార్చిన భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమున్నీసా బేగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం గంజాయి పట్టుకున్న కేసులో నిందితులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అయితే స్టేషన్‌లో ఉన్న సమయంలో ఒక నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

కేసుకు సంబంధించిన పంచనామా వివరాలను మార్చి, కేవలం ఒక నిందితుడిని మాత్రమే కోర్టులో హాజరుపరిచినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. పంచనామా, ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలపై లోతుగా పరిశీలించిన అనంతరం సీఐ రహిమున్నీసా బేగంపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.