BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 31 August 2026, 08:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన...

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:45 AM
18 వీక్షణలు

22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన.. నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు కసరత్తు

హైదరాబాద్‌: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అంశంపై ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించినట్లు తెలుస్తోంది.

నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన భూములను పరిశీలించి వెంటనే తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ల పరిధిలో లేని, సీసీఎల్‌ఏ పరిధిలోకి వచ్చే భూముల తొలగింపునకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు తెలిసింది.

ఆదివారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా 22ఏ భూముల వివరాలు, పెండింగ్‌ అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.

ఇటీవల 22ఏ అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రజల తరఫున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, త్వరలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

అయితే 22ఏ భూముల వ్యవహారంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుతం జరుగుతున్న మార్పులపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.