వై మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
వై మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ – లబ్ధిదారులకు అండగా టిడిపి నాయకులు....
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
ఎన్ఎస్ పేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. చక్రమాలిగ వీధి, రాంనగర్ వీధి, అలా అన్నారు వీధి తదితర ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా.24.25.26 వార్డులలో ముజామిల్, సుహెల్ బాషా, తౌసిఫ్, రియాజ్, ఫయాజ్, సుధాకర్ తదితరులు పాల్గొని లబ్ధిదారులను పలకరించారు. పింఛన్లు అందడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు పేద, బలహీన వర్గాలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.
ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2,693.90 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ముజామిల్, సుహెల్ బాషా, తౌసిఫ్, రియాజ్, ఫయాజ్, సుధాకర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ సొమ్ము వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు నెలవారీ అవసరాల్లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.