BREAKING
వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
Date of Publish : 01 September 2026, 08:17 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Sep, 2026 - 08:17 AM
22 వీక్షణలు

బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ....

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు: పట్టణంలోని బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు జనరల్ సెక్రటరీ ఈ.ఎస్. గంగులచారి పాల్గొని అర్హులైన పెన్షన్‌దారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.

అలాగే హనుమంతరాయనిదిన్నె ప్రాంతంలోనూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకం ద్వారా ప్రతి నెలా ఆర్థిక సహాయం అందుతోంది.

ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది పెన్షన్‌దారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2,693.90 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా గంగులచారి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ సొమ్ము వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు నెలవారీ అవసరాల్లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.