BREAKING
వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
Date of Publish : 01 September 2026, 07:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బొల్లవరం: 88 ఏళ్ల వృద్ధుడికి ఆస్తి హక్కులు పునరుద్ధరణ – కుమారుల పేర్లపై గిఫ్ట్ డీడ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:56 AM
5 వీక్షణలు

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ న్యాయం చేసింది. తన ఇద్దరు కుమారులు బండి ఆత్మకూరు నరసింహారెడ్డి, బండి ఆత్మకూరు రామిరెడ్డి పేర్లపై చేసిన గిఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ డీడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆయన జమ్మలమడుగు సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

విచారణలో కుమారులు వృద్ధ తండ్రిని సక్రమంగా చూసుకోకపోవడం, ఆహారం, వైద్యం, నివాసం వంటి కనీస అవసరాలు కల్పించకపోవడం నిర్ధారణ అయింది. దీంతో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం 16-07-2019న నమోదైన డాక్యుమెంట్‌ నంబర్లు 7524/2019, 7525/2019 గిఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ డీడ్లను చెల్లుబాటు కానివిగా ప్రకటిస్తూ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత ఆస్తులపై హక్కులు, టైటిల్‌, ఆసక్తిని తిరిగి బండి ఆత్మకూరు రామిరెడ్డికి పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని అధికారులకు సూచించింది.

వృద్ధుల గౌరవం, భద్రత, సంక్షేమానికి చట్టపరమైన రక్షణ ఉంటుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.