ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం కోతులనడుమ పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు, పట్టించుకోని అధికారులు
ఎల్కతుర్తి: మండలంలోని కోతుల నడుమ, సూరారం, శాంతినగర్ ,పలు గ్రామాలకు నేషనల్ హైవే వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులు నిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం నేషనల్ హైవే దాటి వెళ్తుంటారు. ఎందుకనగా వారి, భూములన్నీ కూడా హైవేకు ఇరువైపులా ఉండడం వల్ల నిరంతరం వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్తూ ఉంటారు, అలాంటిది క్రాసింగ్ లేక ఏ చిన్న పని మీద మరియు అత్యవసర పనుల మీద, వెళ్లాలన్న కూడా ప్రజలు అందరూ ,విద్యార్థులు, వృద్ధులు, కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విద్యార్థులు నాయకులు అందరూ కూడా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు, ఒక మహిళ రోడ్డు దాటడానికి వీలు లేక హైవే డివైడర్ కింది నుండి వెళ్లడానికి ప్రయత్నించింది , చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అటువైపు చూస్తు వెళ్తున్న వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి సాహసాల వల్ల ప్రాణ నష్టాలు జరుగుతాయని అంటున్నారు, ఆయా గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ,లేనిచో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మరోసారి ప్రభుత్వానికి వారి ఇబ్బందులను విన్నపించారు.