BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 07:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెద్దకొమిరలో ఉపాధ్యాయుల ఆందోళన....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:52 PM
11 వీక్షణలు

పెద్దకొమిరలో ఉపాధ్యాయుల ఆందోళన.. మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమిర గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేపట్టారు.

ఏపీ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న అధ్యాపక బృందంతో పాటు అధ్యాపకేతర సిబ్బంది సుమారు 40 మందికి గత మూడు నెలలుగా జీతాల బిల్లులు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ గంపలగూడెం మండల యుటిఎఫ్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. పాఠశాల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్లడంతో జీతాల బిల్లులు పెట్టే వారు లేరనే కారణం చూపుతున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు.

తక్షణమే జీతాల బిల్లులు నమోదు చేసి మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని కోరారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి ప్రిన్సిపాల్ హేమలతకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.