భక్తుల ఫిర్యాదులపై స్పందన లేదని ఆరోపణలు..
భక్తుల ఫిర్యాదులపై స్పందన లేదని ఆరోపణలు.. బోయకొండ గంగమ్మ దేవస్థానంపై భక్తుల ఆవేదన
అన్నమయ్య జిల్లా | చౌడేపల్లి మండలం | దిగువపల్లి
చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన స్పందన లభించడం లేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవస్థాన కార్యాలయానికి తమ సమస్యలు, ఫిర్యాదులు తెలియజేసేందుకు వచ్చే భక్తులకు సిబ్బంది నుంచి సరైన స్పందన అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కోసం స్పష్టమైన సమాచారం అందడం లేదని కొందరు భక్తులు పేర్కొంటున్నారు.
అలాగే దేవస్థానం ఈవో, ఉప కమిషనర్ కి ఫోన్ ద్వారా సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదని కొందరు భక్తులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై దేవస్థానం అధికారుల అధికారిక వివరణ అందాల్సి ఉంది.
దేవస్థానానికి వచ్చే భక్తుల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తగిన చర్యలు తీసుకునేలా అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, స్పందన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.