గంపలగూడెం కేజీబీవీలో 280 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గంపలగూడెం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ గంపలగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 280 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.
కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లజోళ్లను త్వరలో పంపిణీ చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుందా నాగభూషణం, కార్యదర్శి కొండా నాగిరెడ్డి, కోశాధికారి నేరెళ్ల రంగనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పునూరు దివ్యవాణి, కుందా కోటేశ్వరరావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కంచర్ల ముత్య ప్రసాద్, తిరువూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పీవీ రావు, రామసీత, ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.