చింతలపూడిలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా చింతలపూడిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ చీదరాల దుర్గా పార్వతి మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువత, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.