తిరువూరులో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
తిరువూరు: తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను, ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఆరోగ్య రంగం అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు గంజా కృష్ణమోహన్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీడిమల్ల వెంకటేశ్వరరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, ఇజ్జాడ జగన్నాథం, పర్వతం రామారావు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇన్చార్జి చిన్నంశెట్టి నాగేశ్వరరావు, గంధం శ్రీనివాసరావు, మాధవ్, కుంచం చంద్రరావు, కుంచం దినేష్, యద్దనపూడి రాములు, గరికపాటి నరసింహారావు, మొగిలిపువ్వు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.