వినాయక నవరాత్రి ఉత్సవాలపై సమీక్షా సమావేశం
తెలంగాణ
/
హన్మకొండ
ప్రశాంతంగా, పర్యావరణహితంగా ఉత్సవాల నిర్వహణపై అధికారుల చర్చ
హనుమకొండ | Ntoday News
వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.