నేడు స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
రూ.620 కోట్లతో 3.23 కి.మీ. పొడవున నిర్మాణం
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. రూ.620 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు.
3.23 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు విస్తరించింది.
ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.