BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 08:04 pm
Posted by : SIVA RAJ

ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
03 Sep, 2026 - 08:04 PM
5 వీక్షణలు

గుంటూరు బస్టాండ్‌లో ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు | Ntoday News

గుంటూరు బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులను వేగవంతం చేయాలని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌లో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పలు అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా బస్టాండ్‌లోని దుకాణాల్లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, ప్రయాణికుల సౌకర్యాలు, బస్టాండ్ పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అదేవిధంగా గుంటూరులో చేపడుతున్న ఎలక్ట్రిక్ బస్ డిపో నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు.