BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్కవరంలో విషాదం.. యువకుడి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:41 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం: లక్కవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోసన తిరుమలరెడ్డి (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను నివాసం ఉంటున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా భార్య కాకినాడ వెళ్లినట్లు సమాచారం. తిరుమలరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తిరుమలరెడ్డి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.