బిట్టూ భగీరథ ప్రయత్నం ...
జాతీయం
బిట్టూ భగీరథ ప్రయత్నం ...
Bhopal : మధ్యప్రదేశ్ 'అజ్నార్' నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ కుప్పలను, విషపూరితమైన చెత్తను తానొక్కడే చేతులతో తీసిపారేస్తూ నెట్టింట కొత్త ప్రభంజనాన్ని సృష్టించాడు. అతని పేరు బిట్టూ తబాహి! ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక కుర్రాడు ఒంటరిగా భుజాన వేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బిట్టూ పెద్ద భగీరథ ప్రయత్నం చేశాడు. ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసే మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు అసలు ఏం చేస్తున్నాయంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.