ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
పెద్దపల్లి: ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
సోమవారం పెద్దపల్లిలో విద్యార్థులకు స్కాలర్షిప్ పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికీ విడుదల చేయలేదని అన్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచే నేరుగా ఫీజులు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై తీవ్ర భారం పడుతోందని, ఎంతో మంది విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.