నూతన వధూవరులను ఆశీర్వదించిన కంచర్ల కృష్ణారెడ్డి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
నల్లగొండ: ధర్వేశిపురం (ఎల్లమ్మగూడెం)లోని కచరకుంట్ల యాదగిరిరెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వివాహ వేడుకలకు నల్లగొండ పార్లమెంటరీ ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోయ వెంకన్న–కవిత దంపతుల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కంచర్ల కృష్ణారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు గౌడ్, చిట్యాల మాజీ జెడ్పీటీసీ సుంకరి యాదగిరి గౌడ్, ఆడెపు బిక్షం, నడింపల్లి నరసింహ, పాకాల లింగస్వామి, సాగర్ల వెంకన్న, ఉయ్యాల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.