సెప్టెంబర్ 6న ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్ 6న ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 6న మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.