BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
21 Apr, 2026 - 01:55 PM
99 వీక్షణలు

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహణ.. ప్రజల భద్రతే లక్షమ్ 

ప్రజల భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు.....

రోడ్డు ప్రమాదాలు నియంత్రించుటకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులలో స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వాహనాలు తనిఖీ చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో ప్రైవేట్ వాహనాలు,ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలలో ప్రజల భద్రతను దృషిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు మరియు సరైన భద్రతా చర్యలు,జాగ్రత్తలు పాటించాలని  బస్సులలో  తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు నంద్యాల పోలీసులు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జిల్లా రాత్రిపూట తిరిగే వాహనాలను ఆపి “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

జిల్లాలోని కడప నుండి నంద్యాల హైవే,కర్నూలు నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు,నంద్యాల నుండి కర్నూలు NH 44 హైవే,కర్నూలు నుండి బెంగుళూరు వైపు వెళ్ళే వాహనాలు మరియు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలలో ఈ “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో”కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.అంతేకాక వాహనాలకు సంబంధించిన ద్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. 

వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు. వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా పోలీసులు తెలియజేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.