BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
21 Apr, 2026 - 01:55 PM
57 వీక్షణలు

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహణ.. ప్రజల భద్రతే లక్షమ్ 

ప్రజల భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు.....

రోడ్డు ప్రమాదాలు నియంత్రించుటకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులలో స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వాహనాలు తనిఖీ చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో ప్రైవేట్ వాహనాలు,ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే వాహనాలలో ప్రజల భద్రతను దృషిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు మరియు సరైన భద్రతా చర్యలు,జాగ్రత్తలు పాటించాలని  బస్సులలో  తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు నంద్యాల పోలీసులు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జిల్లా రాత్రిపూట తిరిగే వాహనాలను ఆపి “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

జిల్లాలోని కడప నుండి నంద్యాల హైవే,కర్నూలు నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు,నంద్యాల నుండి కర్నూలు NH 44 హైవే,కర్నూలు నుండి బెంగుళూరు వైపు వెళ్ళే వాహనాలు మరియు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలలో ఈ “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో”కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.అంతేకాక వాహనాలకు సంబంధించిన ద్రువపత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. 

వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని డ్రైవర్లకు గుర్తు చేస్తున్నారు. వాహనాలను అతి వేగంతో నడపకుండా, రాంగ్ రూట్ లో వెళ్ళకుండా, పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా పోలీసులు తెలియజేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.