BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా మెగా పేరెంట్–టీచర్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 06:16 PM
57 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, పెనుగొలను:

పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్–టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ సౌకర్యాలు అందుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను చేర్పించాలని కోరారు.

కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు, సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి, మాజీ సర్పంచి సంగెపు నారాయణ, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసరావు, మెట్టగుట్ట దేవస్థానం చైర్మన్ పంది వెంకట్రావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు, యనమద్ది విజయకుమార్, ఎం. రాజారెడ్డి, బొలగాని కృష్ణారావు, తోట నాగరాజు, సంగెపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతరం పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రధానోపాధ్యాయుడు కొర్రపాటి యోహాను అధ్యక్షతన మెగా పేరెంట్–టీచర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల అభ్యాస పురోగతి, క్రమశిక్షణ, హాజరు శాతం, తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.