నాటక రచయిత టీ. తాతారావు యాదవ్కు జాతీయ పురస్కారం
శ్రీ దాశరథి కృష్ణమాచార్య జాతీయ పురస్కారం అందుకున్న యువ నాటక రచయిత
నెల్లూరు జిల్లా | Ntoday News
సాంఘిక నాటక రంగంలో విశేషంగా రచనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని కళాకారుల మన్ననలు పొందుతున్న యువ నాటక రచయిత టీ. తాతారావు యాదవ్కు అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు జిల్లాలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శ్రీ దాశరథి కృష్ణమాచార్య జాతీయ పురస్కారం అందజేశారు.
సాంఘిక అంశాలను ప్రతిబింబించే పలు నాటకాలను రచిస్తూ నాటక రంగానికి సేవలందిస్తున్న తాతారావు యాదవ్ ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జాతీయ పురస్కారం అందుకున్న తాతారావు యాదవ్ను పలువురు కళాకారులు, నాటక రంగ ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ నాటకాలను రచించి తెలుగు నాటక రంగానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.