BREAKING
నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!
Date of Publish : 07 September 2026, 05:10 am
Posted by : SEETHA KIRAN KUMAR

హనంకొండ :సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 05:10 AM
2 వీక్షణలు

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

123 మంది లబ్ధిదారులకు రూ.32.40 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..

హనుమకొండ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.


ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 123 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.32,40,000/- విలువైన సీఎం సహాయనిధి చెక్కులను బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.