మహిళా సాధికరాతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం :ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు కోసం సెర్ప్,SBI-RSETI ఖమ్మం మరియు ఉషా కిరణాలు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానందు మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వలాంబనా, సాధికారితా కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పధకాలును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు
మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు, మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం,, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం చెప్పటిందని వివరించారు. జూట్ బ్యాగ్ తయారీ వంటి నైపుణ్య శిక్షణాలను సద్వినియోగం చేసికొని మహిళలు స్వయం ఉపాధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమం లో కల్లూరు AMC చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, APM, APO, ఇంచార్జి MPDO, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరావు, సత్తుపల్లి కౌన్సిలర్ తోట సుజాల రాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బల్లి మనీషా, ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.