BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 06:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కండ్రిగూడెం వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Sep, 2026 - 06:56 PM
10 వీక్షణలు

రెండు నెలల క్రితమే పట్టుబడినా కొనసాగుతున్న అక్రమ రవాణా

ఏలూరు జిల్లా కండ్రిగూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. దెందులూరుకు చెందిన తాళ్లూరి నాగరాజు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రెవెన్యూ శాఖ డీటీ రమేష్, విజిలెన్స్ ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో నాగరాజును అదుపులోకి తీసుకుని, అతనిపై 6ఏ, 7(ఐ) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. అయితే కొంతమంది అక్రమంగా బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కాగా, తాళ్లూరి నాగరాజు వద్ద రెండు నెలల క్రితం కూడా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ మరోసారి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడటంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు