BREAKING
​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం
www.ntodaynews.com

బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 May, 2026 - 07:25 AM
18 వీక్షణలు

బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి-- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జి.ఓ. ఎం.ఎస్. నెంబర్ .38 ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.శుక్రవారం రోజున మినీ మీటింగ్ హాల్ లో సాధారణ బదిలీలకు సంబంధించిన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెంబర్ 38 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఒక కార్యాలయం లేదా విభాగంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులను కూడా సాధారణ బదిలీల పరిధిలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.బదిలీల ప్రక్రియలో ఎటువంటి వివక్ష లేకుండా సీనియారిటీ, పని చేసిన కాలం, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల అభ్యర్థనలు, ఖాళీల వివరాలు, శాఖల అవసరాలను సమన్వయం చేస్తూ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.