BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 May, 2026 - 06:25 AM
202 వీక్షణలు

ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి--సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం 

వరి ధాన్యం పండించిన రైతుకు ప్రతి సీజన్లో తిప్పలు తప్పడం లేదు అని బొమ్మలరామారం సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో ఉన్న ధాన్యాన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం మరోవైపు మిల్లర్లు 40 కిలోలు కాదు 42 కిలోలు తూకం వేయడం రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి మండలంలో  కొనసాగుతున్నది అని అన్నారు వరి ధాన్యము కొనుగోలు సెంటర్లో లోడ్ అయిన  ధాన్యం మిల్లుకు వెల్లి రోజులతరబడి మిల్లుల వద్ద పడి కాపులు కాయడం చివరికి మిల్లర్ల  దయాదాక్షిన్యాల మీద అన్లోడ్ అవుతున్న పరిస్థితి ఉన్నది అని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మిల్లర్లు బేఖాతారు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది అని అన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేదొకటిగా మరొకటి అని అన్నారు. కేవలం పత్రికా ప్రకటనలు చేస్తూ మంత్రులు, ఎంఎల్ ఏ లు కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం  ఏమాత్రం సరైనది కాదు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే అదనంగా కాంటాలు, లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి అని అన్నారు. వేసవికాలం మండుటెండల్లో రైతులు మార్కెట్లో ఉండి వడదెబ్బకు గురి అవుతూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఈ  కార్యక్రమంలో మసిరెడ్డిపల్లి సర్పంచ్ నోముల రాంరెడ్డి, మండల కమిటీ సభ్యులు ముక్యర్ల పున్నమ్మ,నాయకులు ప్యారారం నరసింహ,  ఎల్లమైన వెంకటేష్, ఎల్లబోయిన సాయికుమార్, జల శ్రీనివాస్, కుశంగల అంజమ్మ, పండుగ కుమార్, నోముల కొండల్ రెడ్డి, సిద్దంకి లక్ష్మి, పండుగ రాములు, తోటకూర కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు