BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ అమలు చేయాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 10:56 AM
29 వీక్షణలు

ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ అమలుపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే సంబంధిత సర్కులర్‌ను మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) సకాలంలో ఫార్వర్డ్ చేయని విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, జర్నలిస్టుల పిల్లలకు అందాల్సిన ఫీజు రాయితీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.