BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ అమలు చేయాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 10:56 AM
80 వీక్షణలు

ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ అమలుపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే సంబంధిత సర్కులర్‌ను మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) సకాలంలో ఫార్వర్డ్ చేయని విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, జర్నలిస్టుల పిల్లలకు అందాల్సిన ఫీజు రాయితీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.