BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అయ్యప్ప స్వామి ఆలయంలో వరుస చోరీలు.. గ్రామస్తుల్లో ఆందోళన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:47 AM
78 వీక్షణలు

జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పట్టపగలే చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయం కింద ఉన్న గది తలుపులు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

దొంగలు దాదాపు 100 కలశాలు, 45 రాగి, ఇత్తడి దీప కుందులు సహా పలు విలువైన వస్తువులను అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా, గత రెండు రోజుల వ్యవధిలోనే ఇదే దేవాలయంలో మూడు సార్లు చోరీలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.