BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:48 AM
86 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

ఏబీవీపీ ఇచ్చిన బంద్‌ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ సందేశాల ద్వారా తెలియజేశాయి. బంద్ కారణంగా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు సందేశాల్లో పేర్కొన్నాయి.

విద్యా రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నేతలు తెలిపారు. బంద్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యా కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు తమకు సంబంధించిన పాఠశాలల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.