తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు
హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది.
ఏబీవీపీ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ సందేశాల ద్వారా తెలియజేశాయి. బంద్ కారణంగా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు సందేశాల్లో పేర్కొన్నాయి.
విద్యా రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నేతలు తెలిపారు. బంద్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యా కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు తమకు సంబంధించిన పాఠశాలల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.