www.ntodaynews.com
మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం: షీ టీం ఎస్సై ఉషారాణి
మంచిర్యాల: మహిళా ఉద్యోగుల రక్షణే షీ టీం ధ్యేయమని జిల్లా షీ టీం ఎస్సై ఉషారాణి అన్నారు. శనివారం మంచిర్యాలలోని షాపింగ్ మాల్స్లో మహిళా సిబ్బందికి ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు పని ప్రదేశాల్లో ఎదురయ్యే వేధింపులపై మౌనంగా ఉండకూడదని, ఆపద సమయంలో వెంటనే డయల్ 100, వాట్సాప్ నంబర్ 6303923700 లేదా టి-సేఫ్ (T-Safe) యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవలను వినియోగించుకోవాలని, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉషారాణి భరోసా ఇచ్చారు