BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి.. ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
84 వీక్షణలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలానికి చెందిన పత్తి రంగమ్మ తన వారసత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించింది. సోమవారం మదనపల్లెలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది.

తన ఇంటి స్థలాన్ని ఉమా, సుబ్బయ్య ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అడ్డుకోవడంతో తనపై దాడి చేసి పళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారని ఆమె వాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదని, ప్రత్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

అలాగే కొందరు రాజకీయ నాయకుల అండతో తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్తి రంగమ్మ పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని తెలిపిన ఆమె, వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.