BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి.. ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
22 వీక్షణలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలానికి చెందిన పత్తి రంగమ్మ తన వారసత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించింది. సోమవారం మదనపల్లెలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది.

తన ఇంటి స్థలాన్ని ఉమా, సుబ్బయ్య ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అడ్డుకోవడంతో తనపై దాడి చేసి పళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారని ఆమె వాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదని, ప్రత్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

అలాగే కొందరు రాజకీయ నాయకుల అండతో తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్తి రంగమ్మ పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని తెలిపిన ఆమె, వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.