BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి.. ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
58 వీక్షణలు

అన్నమయ్య జిల్లా రామాపురం మండలానికి చెందిన పత్తి రంగమ్మ తన వారసత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించింది. సోమవారం మదనపల్లెలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది.

తన ఇంటి స్థలాన్ని ఉమా, సుబ్బయ్య ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అడ్డుకోవడంతో తనపై దాడి చేసి పళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారని ఆమె వాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదని, ప్రత్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

అలాగే కొందరు రాజకీయ నాయకుల అండతో తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్తి రంగమ్మ పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని తెలిపిన ఆమె, వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.