ఇంటి స్థలం కబ్జా అడ్డుకున్నందుకు దాడి.. ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా రామాపురం మండలానికి చెందిన పత్తి రంగమ్మ తన వారసత్వ ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించింది. సోమవారం మదనపల్లెలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది.
తన ఇంటి స్థలాన్ని ఉమా, సుబ్బయ్య ఆక్రమించేందుకు ప్రయత్నించారని, అడ్డుకోవడంతో తనపై దాడి చేసి పళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారని ఆమె వాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత ఎస్ఐ కేసు నమోదు చేయలేదని, ప్రత్యర్థులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
అలాగే కొందరు రాజకీయ నాయకుల అండతో తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పత్తి రంగమ్మ పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని తెలిపిన ఆమె, వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.