BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

యోగా డే కోసం కోట్లు.. పేదల కోసం ఎందుకు కాదు?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 11:47 AM
73 వీక్షణలు

దేశంలో ఆకలి బాధతో అలమటిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిండికి, ఉపాధికి, కనీస అవసరాలకు నోచుకోని ప్రజలు కష్టాల్లో జీవిస్తుంటే, యోగా దినోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఆసనాలు వేయాలంటే ముందుగా ఆకలి తీరాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ భద్రత ఉండాలి. చట్టప్రకారం వేతనాలు అందాలి. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలి. దోపిడీని అరికట్టాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి.

ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటి మౌలిక సమస్యలు అలాగే ఉండగా, భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా, ఆర్భాట కార్యక్రమాలతో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"ప్రజల కడుపు నిండితేనే ఆరోగ్యం, ఆ తర్వాతే యోగా" అని పలువురు సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యోగా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఆకలి తీర్చడం, ఉపాధి కల్పించడం, జీవన భద్రత కల్పించడం ప్రభుత్వాల తొలి బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.