BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

యోగా డే కోసం కోట్లు.. పేదల కోసం ఎందుకు కాదు?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 11:47 AM
18 వీక్షణలు

దేశంలో ఆకలి బాధతో అలమటిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిండికి, ఉపాధికి, కనీస అవసరాలకు నోచుకోని ప్రజలు కష్టాల్లో జీవిస్తుంటే, యోగా దినోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఆసనాలు వేయాలంటే ముందుగా ఆకలి తీరాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ భద్రత ఉండాలి. చట్టప్రకారం వేతనాలు అందాలి. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలి. దోపిడీని అరికట్టాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి.

ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటి మౌలిక సమస్యలు అలాగే ఉండగా, భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా, ఆర్భాట కార్యక్రమాలతో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"ప్రజల కడుపు నిండితేనే ఆరోగ్యం, ఆ తర్వాతే యోగా" అని పలువురు సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యోగా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఆకలి తీర్చడం, ఉపాధి కల్పించడం, జీవన భద్రత కల్పించడం ప్రభుత్వాల తొలి బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.