www.ntodaynews.com
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం.. విద్యుత్ పరికరాలకు భారీ నష్టం
తెలంగాణ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడీ గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన పిడుగు ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కోల రాములు ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది.
పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
అయితే పిడుగు ప్రభావంతో సమీపంలోని ఇళ్లలో సుమారు పది ఫ్యాన్లు, ఫ్రిజ్లు, టీవీలు సహా పలు విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో బాధితులు గణనీయమైన ఆస్తి నష్టాన్ని ఎదుర్కొన్నారు.
ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరుతున్నారు.