BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
28 Mar, 2026 - 12:17 AM
520 వీక్షణలు

చిట్యాల  వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం అంబేద్కర్‌ నగర్‌ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. లోక కల్యాణం కోసం సీతారాముల పవిత్ర వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

​అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం

​ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామివారు పెళ్లి కుమారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.  పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున  పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామివారు కళ్యాణం లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

​శోభాయమానంగా ఊరేగింపు  ​కల్యాణం అనంతరం సాయంత్రం స్వామివారి శోభాయాత్ర (ఊరేగింపు) అట్టహాసంగా ప్రారంభమైంది. పల్లకిలో కొలువుదీరిన సీతారామచంద్రులను పురవీధుల్లో ఊరేగిస్తుండగా, భక్తులు నీరాజనాలు పలికారు. ఈ ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా మహిళల కోలాట ప్రదర్శన నిలిచింది. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు లయబద్ధంగా కోలాటం ఆడుతూ పాడిన పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

​భక్తుల జనసందోహం: జై శ్రీరామ్ నామస్మరణతో చిట్యాల పురవీధులు మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.