నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు
నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు NTODAY NEWS చిట్యాల
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో దేశంలో 89 సార్లు పేపర్ లీకులు జరగడం బీజేపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలను కేంద్రం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగినట్లు స్వయంగా ఎన్ టి ఏ అంగీకరించడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చ అని, ఈ మాఫియా వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యువజన కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దామానూరి పృథ్వి, నాయకులు దేశబోయిన లింగస్వామి, అందే చందు, చీమల సతీష్, ఆరూరి చందు, చిన్నం వెంకటేష్, కొండా రాజు, గోషిక అక్షయ్, దేవరపల్లి నవీన్, అందే బన్నీ తదితరులు పాల్గొన్నారు.