www.ntodaynews.com
పాస్పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ | N Today News
పాస్పోర్ట్ సేవలకు సంబంధించిన ఫీజులను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన కొత్త ఛార్జీలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త ఫీజుల ప్రకారం, 60 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.3,500, 60 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.6,000గా నిర్ణయించారు.
అలాగే 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.2,500, 36 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000గా ఖరారు చేశారు.
పాస్పోర్ట్ సేవల ఫీజులను సుమారు 14 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం సవరించినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.
పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కొత్త ఫీజులను దృష్టిలో ఉంచుకుని తమ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.