BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
26 Jun, 2026 - 06:45 PM
8 వీక్షణలు


సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి

నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి


మైనారిటీల సంక్షేమానికి, హక్కుల రక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది - వెలంపల్లి


మొహరం (పీర్ల పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన రోజున నియోజకవర్గ పరిధిలో స్థానిక వించిపేట మహబూబ్ సుభాని జండా చెట్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జెడ్ ఎస్ బాషి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని మైనారిటీ సోదరులకు షర్బత్ పంపిణీ చేసారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మొహరం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని,అది సత్యం,ధర్మం మరియు త్యాగానికి నిలువెత్తు రూపమని కొనియాడారు.అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి,ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన మహోన్నత త్యాగానికి ఈ మొహరం చిహ్నమని పేర్కొన్నారు.ఆయన చూపిన త్యాగనిరతి,శాంతి మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు.పశ్చిమ నియోజకవర్గంలో హిందూ-ముస్లిం భాయ్-భాయ్ అంటూ అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం ఇక్కడి గంగా-జమునా తెహజీబ్ (మతసామరస్య సంస్కృతి)కి అద్దం పడుతోందని హర్షం వ్యక్తం చేశారు.ప్రస్తుత ఎండ తీవ్రతలో ఉన్న ప్రజలకు ఈ చల్లని షర్బత్ ఎలా ఉపశమనాన్ని ఇస్తుందో అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం ఎల్లప్పుడూ మైనారిటీల జీవితాల్లో చల్లదనాన్ని, భరోసాను నింపుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.జగనన్న ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి,వారి హక్కుల రక్షణకు,ఆర్థిక అభ్యున్నతికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.భవిష్యత్తులో కూడా పశ్చిమ నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ,వారి పండుగలకు,వారి సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని,వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు,డివిజన్ ఇంచార్జ్‌లు,అనుబంధ విభాగాల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.