www.ntodaynews.com
విస్సన్నపేటలో ఘనంగా మొహరం వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
మత సామరస్యంగా ఘనంగా మొహర్రం వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మొహర్రం పండుగ వేడుకలను మత సామరస్య వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పీర్ల పంజా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ వర్గాల ప్రజలు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.