www.ntodaynews.com
ఏలూరు జిల్లాలో ఘనంగా హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లాలో ఘనంగా హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ
దేశభక్తి స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను చాటుతూ ఏలూరు జిల్లాలో గురువారం హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి కె., జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో అధికారులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో ఏలూరు పురవీధులు మార్మోగాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.