చికెన్, మటన్ షాపులకు గుడ్బై.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరం శాకాహార నగరంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పరిధిలో ఉన్న మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ప్రకారం నగరంలోని 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో, దీపావళి నాటికి విడతల వారీగా రామ్నగర్, సుజాబాద్, గణేశ్పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు తరలించనున్నారు.
ఈ మార్పుతో వారణాసి దేశంలో రెండో శాకాహార నగరంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్లోని పాలితానా మాత్రమే పూర్తి శాకాహార పట్టణంగా గుర్తింపు పొందింది. అక్కడ 2014 నుంచి మాంసం, చేపలు, గుడ్ల విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది.
వారణాసి జనాభాలో సుమారు 72 శాతం హిందువులు, 27 శాతం ముస్లింలు ఉన్నట్లు అంచనా. ఈ నిర్ణయంపై వ్యాపారులు, స్థానికుల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.