BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
68 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం శాకాహార నగరంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పరిధిలో ఉన్న మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం నగరంలోని 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో, దీపావళి నాటికి విడతల వారీగా రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు తరలించనున్నారు.

ఈ మార్పుతో వారణాసి దేశంలో రెండో శాకాహార నగరంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లోని పాలితానా మాత్రమే పూర్తి శాకాహార పట్టణంగా గుర్తింపు పొందింది. అక్కడ 2014 నుంచి మాంసం, చేపలు, గుడ్ల విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది.

వారణాసి జనాభాలో సుమారు 72 శాతం హిందువులు, 27 శాతం ముస్లింలు ఉన్నట్లు అంచనా. ఈ నిర్ణయంపై వ్యాపారులు, స్థానికుల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.