గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీకి ఘన స్వాగతం
అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ కుళ్లాయిస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు, జిల్లా టీడీపీ నాయకుడు ఆలం వెంకట నరసా నాయుడు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజాప్రతినిధుల రాకతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. వారిని ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తలారి కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, హిత హాస్పిటల్ ఎండీ లక్ష్మీనాయుడుతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.