BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీకి ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:00 PM
34 వీక్షణలు

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ కుళ్లాయిస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు, జిల్లా టీడీపీ నాయకుడు ఆలం వెంకట నరసా నాయుడు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజాప్రతినిధుల రాకతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. వారిని ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తలారి కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, హిత హాస్పిటల్ ఎండీ లక్ష్మీనాయుడుతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.