www.ntodaynews.com
మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్పీడీసీఎల్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్
కడప | N Today News
మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ విద్యుత్ బిల్లుల చెల్లింపుల సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) కడప పరిధి అధికారులు తెలిపారు.
కడప ఈఈ హరి సేవ్యానాయక్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వ సెలవు రోజైన శుక్రవారం కూడా విద్యుత్ బిల్లు వసూలు కేంద్రాలు సాధారణ సమయాల్లోనే పనిచేస్తాయని వెల్లడించారు.
వినియోగదారులు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యుత్ సేవలకు అంతరాయం కలగకుండా బిల్లులను గడువులోగా చెల్లించాలని, అందుబాటులో ఉన్న బిల్లు వసూలు కేంద్రాల ద్వారా చెల్లింపులు చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.