BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులా!? ఈటల, డీకే అరుణ పేర్లు ప్రచారంలో

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 09:38 PM
91 వీక్షణలు

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో బీజేపీ అధిష్ఠానం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గ నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఈటల రాజేందర్‌కు రాష్ట్ర రాజకీయాల్లో, మాజీ మంత్రిగా ఉన్న అనుభవం, బీసీ వర్గాల్లో ఉన్న ప్రభావం కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే డీకే అరుణకు కేంద్రంలో అవకాశం కల్పించడం ద్వారా రెడ్డి సామాజికవర్గంలో పార్టీ బలాన్ని పెంచాలనే వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈటల రాజేందర్, డీకే అరుణకు మంత్రి పదవులు ఖరారైనట్లు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.