BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులా!? ఈటల, డీకే అరుణ పేర్లు ప్రచారంలో

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 09:38 PM
33 వీక్షణలు

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో బీజేపీ అధిష్ఠానం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గ నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఈటల రాజేందర్‌కు రాష్ట్ర రాజకీయాల్లో, మాజీ మంత్రిగా ఉన్న అనుభవం, బీసీ వర్గాల్లో ఉన్న ప్రభావం కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే డీకే అరుణకు కేంద్రంలో అవకాశం కల్పించడం ద్వారా రెడ్డి సామాజికవర్గంలో పార్టీ బలాన్ని పెంచాలనే వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈటల రాజేందర్, డీకే అరుణకు మంత్రి పదవులు ఖరారైనట్లు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.