BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:29 PM
43 వీక్షణలు

బద్వేలు | కడప జిల్లా | N Today News

చెక్కు బౌన్స్ కేసులో తిరుపతికి చెందిన ఓ మహిళకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ బద్వేలు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఫిర్యాదుదారుడికి రూ.50 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది.

కేసు వివరాల ప్రకారం, బద్వేలుకు చెందిన విశ్రాంత వైద్యుడు రామప్రసాద్ 2016లో తిరుపతికి చెందిన విజయమ్మకు రూ.50 లక్షలను అప్పుగా ఇచ్చారు. ప్రారంభంలో కొంతకాలం వడ్డీ చెల్లించినప్పటికీ, నిర్ణయించిన గడువులోపు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తరువాత పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, బాకీ మొత్తానికి సంబంధించి విజయమ్మ చెక్కులు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కులు బ్యాంకులో సమర్పించగా ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి.

దీంతో ఫిర్యాదుదారుడు 2020లో బద్వేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితురాలికి ఏడాది జైలు శిక్ష విధించింది.

అదేవిధంగా, అప్పుగా తీసుకున్న రూ.50 లక్షలను ఫిర్యాదుదారుడు రామప్రసాద్‌కు చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.